మే 15న ప్రేక్షకుల ముందుకు ‘ముసలోడికి దసరా పండుగ’
నాన్స్టాప్ నవ్వులు పండించడానికి టాలీవుడ్ తెరపైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘ముసలోడికి దసరా పండుగ’ రాబోతోంది. ఈ చిత్రాన్ని రాజీ నాయుడు - సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణా ఫిలిమ్స్ బ్యానర్పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్నారు.
నాన్స్టాప్ నవ్వులు పండించడానికి టాలీవుడ్ తెరపైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ ‘ముసలోడికి దసరా పండుగ’ రాబోతోంది. ఈ చిత్రాన్ని రాజీ నాయుడు - సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణా ఫిలిమ్స్ బ్యానర్పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా ఇది రూపొందుతోంది. విలక్షణ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ శుక్రవారం (మే 15న) థియేటర్లలో విడుదల కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్లో జోష్ను పెంచేశారు. క్రేజీ టైటిల్తో ఇప్పటికే ట్రైలర్ ప్రచార చిత్రాలతో ఈ సినిమా భారీ అంచనాలను అందుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత రమణ వాళ్లె మాట్లాడుతూ.. ప్రేక్షకులు థియేటర్కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామన్నారు. సినిమా అవుట్పుట్ పట్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని... ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలమన్నారు. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నట్టుగా రమణ వాళ్లె తెలిపారు. చాలా కాలం తర్వాత తెలుగు తెరపైకి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమా రానుండటంతో అంచనాలు సైతం భారీగానే ున్నాయి. ఈ సినిమాలో నాజర్తో పాటు అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేం), అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య తదితరులు నటించారు.