Allu Arjun: అల్లు అర్జున్పై నెట్టింట రూమర్స్.. స్పందించిన అల్లు అరవింద్..
ప్రస్తుతం అల్లు అర్జున్ గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ దాదాపుగా ముంబైలోనే జరుగుతోంది. తరచుగా బన్నీ ముంబై టు హైదరాబాద్ తిరుగుతున్నాడు.
అల్లు అర్జు ‘పుష్ప’ సిరీస్.. అట్లీ ‘జవాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాక వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం ‘రాకా’. అసలు ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఒకరకమైన క్రేజ్ ప్రారంభమైంది. ఆ తరువాత అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో తెలిపింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ దాదాపుగా ముంబైలోనే జరుగుతోంది. తరచుగా బన్నీ ముంబై టు హైదరాబాద్ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ముంబైలోనే ఒక ఇల్లు తీసుకుని ఉండాలనుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆయన ముంబైకి షిఫ్ట్ అవబోతున్నారని.. అక్కడ ఇల్లు కూడా కొనేశాడని కొందరు.. ఒక లగ్జరీ విల్లాను రెంట్కు తీసుకున్నాడని కొందరు చెప్పుకుంటున్నారు.
ఈ వార్తలపై తాజాగా అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అర్జున్ ముంబయికి షిఫ్ట్ అవుతున్నాడన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని... ఆయన పిల్లలు హైదరాబాద్లోనే చదువుతున్నారని, ఇల్లు, సన్నిహితులు, కుటుంబం అంతా ఇక్కడే ఉండటం వలన ఆయన హైదరాబాద్ను వీడే ఆలోచనే లేదన్నారు. ఇక ‘రాకా’ విషయానికి వస్తే.. ఈ సినిమా ఒక విజువల్ వండర్గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. అలాగే లోలా వీఎఫ్ఎక్స్, స్పెక్ట్రల్ మోషన్, ఐరన్హెడ్ స్టూడియోస్ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యాయి. అలాగే ఈ చిత్రంలో దీపికా పదుకొణె నటిస్తుండటంతో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కేమియో రోల్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా అలరించనున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సైతం ఈ సినిమాలో భాగమవుతున్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు ఆమె పాత్రపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ నెగిటివ్ రోల్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అట్లీ పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమాను తొలుత ఈ ఏడాది చివరి నాటికి రిలీజ్ చేయాలని భావించారు కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉంది. దీంతో ఈ ఏడాది విడుదలయ్యే ఛాన్సే లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్లో కానీ.. లేదంటే ‘దసరా’ను కానీ టార్గెట్ చేసే అవకాశం ఉంది.