others Breaking News

త్యాగరాయగానసభలో అడుగుపెట్టగానే పలకరిస్తున్న పురాణపండ శ్రీ విష్ణు గ్రంథం

భారతదేశమంతటా ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్‌లు, ధార్మిక పరిషత్‌లూ ఉన్నాయి. అయితే.. వీటిల్లో నలభైశాతం సంస్థల వద్ద కోట్లాది రూపాయల నిధులున్నాయి.

త్యాగరాయగానసభలో అడుగుపెట్టగానే పలకరిస్తున్న పురాణపండ శ్రీ విష్ణు గ్రంథం

భారతదేశమంతటా ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్‌లు, ధార్మిక పరిషత్‌లూ ఉన్నాయి. అయితే.. వీటిల్లో నలభైశాతం సంస్థల వద్ద కోట్లాది రూపాయల నిధులున్నాయి. అయినా కూడా పవిత్ర ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ, విక్రయాలను వ్యాపారాత్మకంగా చేస్తున్నాయనేది అక్షర సత్యం. అదేమంటే.. గుడులూ, గోపురాలు.. ఆశ్రమాల అభివృద్ధి పేరు చెబుతారు. దైవీయ గ్రంథాలను అవకాశం ఉన్నప్పటికీ పొరపాటున కూడా ఉచితం ఇవ్వరు. కరపత్రాలో, బ్రోచెర్లో ఉచితంగా చేతుల్లో పెడతారు.

జీవితంలో ఎన్నో కష్టాలు.. ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మాత్రం ఎక్కడా ధనాపేక్ష లేకుండా పుస్తక వితరణ చేస్తున్నారు. ఆయనొక అమోఘమైన నాలెడ్జి‌తో సంచరించే అద్భుత వ్యక్తి. తనకి కీడు చేసిన వారికి కూడా మేలు చేసే ఒక మంత్ర పరిమళం లాంటి అక్షర చైతన్యం. ఆయన సుమారు ఇరవై ఏళ్లుగా చేస్తున్న నిస్వార్ధ ధార్మిక ఆధ్యాత్మిక సేవను అందిస్తూ వస్తున్నారు. అలాగే తన మనస్సుని గాఢ రస భక్తితో హత్తుకునే అందమైన భాషాశైలికి వేల కొలది ఫాన్స్ ఉన్నారు. వారంతా ఆయన చేస్తున్న కృషికి హ్యాట్సాఫ్ చెబుతుండటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్.

దైవబలాన్ని మించిన మహాబలం సృష్టిలో లేదని ఢంకా బజాయించి మరీ పురాణపం శ్రీనివాస్ చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన భారతదేశ చరిత్రలో తొలిసారిగా అతి అరుదైన ఐదువందల ఆంజనేయ స్వామివార్ల శిల్పాలతో, వర్ణ చిత్రాలతో, మంత్ర తంత్ర యంత్ర విశేషాలతో, పరమ రమణీయ వ్యాఖ్యానాలతో ‘నేనున్నాను’ అనే అఖండ గ్రంథాన్ని రచించారు. దానిని మూడేళ్ల క్రితం భారతదేశ హోం శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని ఇప్పటికీ సాహితీ ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు పురాణపండ శ్రీనివాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఈ గ్రంథానికి సంబంధించి మరో విశేషం కూడా ఉంది. ‘ఈగ’ వంటి సంచలనాత్మక చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నిర్మించి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రచురించారు. అనంతరం దానిని దాదాపు యావత్తు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతలకు, ముఖ్య సాంకేతిక నిపుణులకు నాడు దీపావళి కానుకగా అందించారు. ఇది వారాహి చలన చిత్ర చరిత్రలో హైలైట్‌గా పేర్కొనాలి. ఆ తరువాత మంత్రశక్తుల మహా కలశంగా రచించి సంకలనీకరించిన మరో అద్భుత గ్రంథం ‘మహామంత్రస్య’. ఐదువందల ఇరవై పేజీల ఈ గ్రంథఆన్ని ఆంధ్రప్రదేశ్ ము

 

పురాణపండ శ్రీనివాస్ లేఖిని నుంచి జాలువారిన మరొక అపురూప వైదిక నిధుల గ్రంథం ‘శ్రీమాలిక’. ఇది సృష్టిస్తున్న సంచలనం ఇంతా అంతా కాదు. ఇప్పటికి ఇరవై ఐదు ఎడిషన్స్ అందిందంటే ఎంతటి గొప్ప గ్రంథమో తెలుస్తోంది. పైగా ఈ గ్రంథం పట్ల యువతరం సైతం ఎక్కువ ఆసక్తి కనబరచడం మరొక విశేషంగానే పేర్కొనాలని హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో అధిక శాతం ముక్త కంఠంతో ఎలుగెత్తారు. ఈ గ్రంథ వితరణ కార్యక్రమంలో ప్రధాన పాత్ర తీసుకున్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు సైతం అభినందించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది మాత్రమే కాదు.. మరో విశేషం కూడా ఉంది. శ్రీమాలిక వైదిక గ్రంథాన్ని కాంచీపురం యతీంద్రులు, కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆవిష్కరించి శ్రీనివాస్‌పై అనుగ్రహాన్ని వర్షించారు. ఇవి మాత్రమే కాకుండా.. యుగే..యుగే, అమ్మణ్ణి, శరణు .. శరణు, నన్నేలు నా స్వామి, భద్రే ... రుద్రే, శంకర...శంకర, జయం ... జయం వంటి పురాణపండ కలం నుంచి జాలువారిన ఆర్ష వైభవ గ్రంథాలు వేల వేల పూజాపీఠాల ముందుకు చేరాయంటే

ఇప్పటి అంశం ఏమంటే... పురాణ పండ అందించిన పచ్చ కర్పూరపు పలుకుల్లాంటి చక్కని అందమైన ముందుమాటలతో శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్ గ్రంథం రూపొందింది. ఇది ఇప్పుడు ఎందరినో చేరుకుంటోంది. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్, శ్రీ రామరక్షాస్తోత్రమ్‌తో కూడిన పరమ భాగ్యాల శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్ నూట ఇరవై ఎనిమిది పేజీల మల్టీ కలర్‌లో రూపొందింది. ఈ గ్రంధాన్ని హైదరాబాద్ చిక్కడపల్లిలోని చారిత్రాత్మక త్యాగరాయ గానసభ శ్రీ వైకుంఠ ఏకాదశి నుండి వందల కొలది భక్తులకు ఉచితంగా ఇప్పటికీ పంపిణీ కొనసాగుతూనే ఉంది. మనకి ఉపయోగపడే విజిటింగ్ కార్డును సైతం ఆలోచించి ఇస్తున్న ఈ రోజుల్లో ఒక బుక్ కాదు.. ఎన్నో విలువైన గ్రంథాలను రచించి, సంకలనీకరించి ఏ స్వార్ధం లేకుండా ఉచితంగా ఇవ్వడం ఒక్క పురాణపండ శ్రీనివాస్‌కే చెల్లింది. ఈ విషయాన్ని ఒక పుస్తకావిష్కరణ సభలో మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు స్వయంగా పేర్ొన్నారు. ఆయన మాటలు అక్షర సత్యాలని కాలం నిరూపిస్తూనే ఉంది. జంట నగరాల విష్ణు భక్తులకు ఈ పుస్తకం త్యాగరాయగానసభ కార్యాలయంలో అందుబాటులో ఉంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర దివ్య గ్రంధాన్ని ఈ ఉగాది పర్వదినం వరకూ ఉచితంగా అందజేస్తామని త్యాగరాయగానసభ క

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 7, 2026 6:46 AM