మహా శివరాత్రికి పురాణపండ 'శంభో మహాదేవ’
పురాణపండ శ్రీనివాస్ అనగానే అక్షర దీపాల ప్రభలు కట్టిన ప్రతిభాస్వంతుడైన ధన్య చరితుడు గుర్తొస్తారు. ఆయన రెండున్నర దశాబ్దాలుగా అమోఘ కృషితో వేల వేల గ్రంథాలను అందించారు. శ్రీశైల మహాక్షేత్రానికి ప్రత్యేక సలహాదారునిగా శ్రీనివాస్ భక్తి పారవశ్యపు సేవలందించారు.
పురాణపండ శ్రీనివాస్ అనగానే అక్షర దీపాల ప్రభలు కట్టిన ప్రతిభాస్వంతుడైన ధన్య చరితుడు గుర్తొస్తారు. ఆయన రెండున్నర దశాబ్దాలుగా అమోఘ కృషితో వేల వేల గ్రంథాలను అందించారు. శ్రీశైల మహాక్షేత్రానికి ప్రత్యేక సలహాదారునిగా శ్రీనివాస్ భక్తి పారవశ్యపు సేవలందించారు. ఆయన అపూర్వ రచనలు, సంకలనాలు ఈ దేశపు ఎల్లలు దాటి అనేక దేశాల్లో తెలుగువారిని భక్తి తన్మయత్వంలో ముంచెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పలు మార్లు మేధో సమాజం కూడా వెల్లడించింది. మహాసరస్వతీదేవి శ్రీ చరణాల చెంత మంత్ర ముగ్ధమైన అమృత రసధారల్లాంటి పవిత్ర గ్రంథాల వెలుగులు నిరంతరాయంగా శ్రీనివాస్ పొంగిస్తూనే ఉన్నారు.
అంతేకాకుండా పుస్తక మాంత్రికునిగా విశేష ఖ్యాతి గడించారు. ప్రముఖ రచయితగానే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన మాసపత్రిక పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ రెండు తెలుగు రాస్ట్రాలకు సుపరిచితులే. ఆయన ఆర్ష భారతీయ వైభవ గ్రంథాలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అపురూప కవిత్వ పుష్ఠితో, అద్భుతమైన ఆర్ష సంస్కృతానురక్తితో, మాటల్లో మార్దవంతో, కంఠంలో వైదిక వైదుష్యంతో ఎన్నెన్నో సభల్లో ప్రసంగించారు. అలాగే ఇంకా ఎన్నెన్నో అమోఘ గ్రంధాలతో బ్రహ్మానందం వైపు , జ్ఞానానందం వైపు అప్రతిహతంగా నిస్వార్ధంగా పురాణపండ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. వచ్చే శివరాత్రికి సుమారు ఐదు వందల పేజీల 'శంభో మహాదేవ' అఖండ గ్రంథాన్ని విడుదల చేస్తున్నారు.
ఒక చోట పుస్తకం , మరొక చోట అద్భుత ప్రసంగం అన్నట్టుగా శ్రీనివాస్ ప్రయాణం కొనసాగుతోంది. శ్రీనివాస్ ప్రయాణంలో శ్రీ పూర్ణిమ, శ్రీమాలిక, నేనున్నాను, అమ్మణ్ణి వంటి అఖండ గ్రంథాలను సృష్టించారు. సాహితీవేత్తలకు, ఆధ్యాత్మిక వేత్తలకు, భక్త పాఠకులకూ ఆయన సంకలనాల గురించి తెలిసిందే. త్వరలో పురాణపండ శ్రీనివాస్ రచించిన 'శంభో మహాదేవ' అఖండ గ్రంథం త్వరలోనే ప్రచురణకు రానుంది. దీనిని రైట్స్ను కాలభైరవ ప్రచురణల సంస్థ వారికి శ్రీనివాస్ ఇచ్చేసినట్లు సమాచారం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల ప్రముఖుల్లో ఎక్కువ మంది పురాణపండ శ్రీనివాస్ రచనల కోసం ఎదురు చూస్తుంటారు. గతంలో ప్రముఖ సినీ నటులు మాగంటి మురళీమోహన్ రవీంద్రభారతిలో ఒక సభలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మురళీ మోహన్ పేర్కొన్న ఈ బలమైన వాఖ్యానికి నాటి సభలో ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి. రమణాచారి ప్రత్యక్ష సాక్షులు కావడం గమనార్హం.