Entertainment

Vanajeevi Ramaiah: భారతీయ భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వ‌చ్చింది. ఇంతటి అద్భుత కథకు అవార్డులు సైతం తలవంచాయి. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఎందరికో ఆదర్శం.

Vanajeevi Ramaiah: భారతీయ భాషల్లోకి ‘వనజీవి రామయ్య’ బయోపిక్

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వ‌చ్చింది. ఇంతటి అద్భుత కథకు అవార్డులు సైతం తలవంచాయి. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఎందరికో ఆదర్శం. రామయ్య జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్‌ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో ఎంపికైంది. ఈ చిత్రాన్ని నంది అవార్డు గ్రహీత వేముగంటి తెరకెక్కించారు. నిదిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి, భూషం రవీంద్రనాథ్, లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మించగా.. బల్లేపల్లి మోహన్ సంగీతాన్ని అందించారు.

తాజాగా చిత్ర‌యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, రాజ‌కీయ విశ్లేష‌కులు వి. ప్రకాష్, తన్నేరు బాబు రావు, నాగ మహేష్, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరై చిత్రాన్ని అభినందించారు. ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించినట్టుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రివ్యూ అనంతరం దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ.. కోటి మొక్కలు నాటి ప్రకృతికి సేవ చేసిన రామయ్య జీవితం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా వెల్లడించారు. త్వరలోనే భారతీయ భాషల్లో కూడా ఈ బయోపిక్‌ను తీసుకురానున్నట్టు వేముగంటి తెలిపారు.

సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ప్రకృతి ప్రేమికుడు రామయ్యకు నివాళిగా అంకితమిస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. కోటి మొక్కలను నాటి వనజీవి రామయ్యగా పేరు తెచ్చుకున్నారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఊరూరూ తిరిగారు. అంతేకాకుండా శుభకార్యాల్లో మొక్కలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా సరికొత్త ఆచారాన్ని నెలకొల్పారు. చెట్ల గింజలను సేకరించి అటవీ ప్రాంతాల్లో చల్లేవారు. ప్రకృతిని ప్రేమించిన ఆ మహానుభావుడు గత ఏడాది ఏప్రిల్‌లో పరమపదించారు. అయినా కూడా ఆయన చూపించిన మార్గం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ బయోపిక్ ద్వారా ఆయన సేవలు, స్ఫూర్తి మరింత విస్తృతంగా ప్రజలకు చేరవ కానున్నాయి.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 18, 2026 9:10 AM