Mufti Police: నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రమిది: ఏఎన్ బాలాజీ
ఒక రచయిత హత్య జరుగుతుంది. ఈ హత్యను ఛేదించే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో అంశాన్ని కూడా హైలైట్ చేశారు.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ - ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తీయవర్ కులై నడుంగ’. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ‘మఫ్టీ పోలీస్’గా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని... తెలుగులో ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ... శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేశారు. ఒక రచయిత హత్య జరుగుతుంది. ఈ హత్యను ఛేదించే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో అంశాన్ని కూడా హైలైట్ చేశారు.
ఆటిజం పిల్లల గురించి తెలిసిందే. బాలీవుడ్లో దీనికి సంబంధించిన చిత్రం ఒకటి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి ఆటిజంను ఈ చిత్రంలో చర్చించారు దర్శకుడు దినేష్ లక్ష్మణన్. ఏఎన్ బాలాజీ ప్రస్థానం సాధారణమైనది కాదు. ఇప్పటికే ఆయన డిస్ట్రిబ్యూటర్గా 400 పైచిలుకు చిత్రాలు పంపిణీ చేసి, నిర్మాతగా "రంగం-2, యుద్ధభూమి, ఒరేయ్ బామ్మర్ది, డాక్టర్ 56, మై డియర్ భూతం" వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. చిత్రం విడుదల సందర్భంగా నిర్మాత బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. ‘మఫ్టీ పోలీస్’ చిత్రం నిర్మాతగా తన స్థాయిని పెంచుతుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందని పేర్కొన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ - ఐశ్వర్య రాజేష్ అలియాస్ భాగ్యంలకు తెలుగునాట ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో ‘మఫ్టీ పోలీస్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని బాలాజీ వెల్లడించారు. ఈ సినిమాలో యాక్షన్తో పాటు పర్సనల్ డ్రామా వంటి అంశాలన్నీ అద్భుతంగా ఉంటాయన్నారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రం అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ అధినేత బాలాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశాన్ని అందించిన జి.అరుల్ కుమార్కి, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్లకు ఈ సందర్భంగా బాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రజావాణి చీదిరాల